నూకాలమ్మ జాతరలో మృతి చెందిన వ్యక్తి కుటుంబాన్ని పరామర్శించిన జనసేన నాయకులు

తుని నియోజకవర్గం, శృంగవృక్షం గ్రామంలో నూకాలమ్మ జాతరలో మృతి చెందిన దళిత సోదరుని కుటుంబాన్ని తొండంగి మండల జనసేన పార్టీ అధ్యక్షులు బెండపూడి నాయుడు మరియు తొండంగి గ్రామ అధ్యక్షులు ఎలుగుబంటి నాగు ఆధ్వర్యంలో బాధిత కుటుంబాన్ని పరామర్శించి, జాతరలో జరిగిన సంఘటన వివరాలు తెలుసుకుని తమ కుటుంబానికి జనసేన పార్టీ అండదండగా ఉంటుందని ఆ కుటుంబానికి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి వంగలపూడి నాగేంద్ర, జిల్లా సంయుక్త కార్యదర్శి పలివేళ్ళ లోవరాజు, తుని మండల అధ్యక్షులు ధారకొండ వెంకట రమణ, తొండంగి మండల ఉపాధ్యక్షులు కండవిల్లి గణేష్, తొండంగి మండల ప్రధాన కార్యదర్శులు గట్టెం నాగబాబు మరియు పసుపులేటి రాంప్రసాద్, తొండంగి మండల అధికార ప్రతినిధి పెదిరెడ్ల దుర్గాప్రసాద్ నియోజకవర్గ సీనియర్ నాయకులు చోడిశెట్టి గణేష్, అనూరు ఈశ్వరరావు, తానే శేషు, అదేపల్లి బాలాజీ, రాజశేషు అంకారెడ్డి, బొప్పాన రాము, ఇండుగబిలి శ్రీను, శివశంకర్, అఖిల భారత చిరంజీవి తొండంగి మండల అధ్యక్షులు వేమవరపు రాంప్రసాద్, తొండంగి మండల సంయుక్త కార్యదర్శి బద్ది సతీష్, మండల సంయుక్త కార్యదర్శి సింగలూరి రాజు, రవికంపాడు గౌరవ అధ్యక్షులు సిద్దాచక్రారావు, బెండపూడి గ్రామ అధ్యక్షుడు కోరుకొండ శివ, పైడికొండ వెంకటేష్ తదితరులు జనసైనికులు పాల్గొని సంతాపం ప్రకటించారు.