Sullurupeta: అయ్యపాలెం, అక్రపాక, గ్రామాల్లో పర్యటించిన జనసేన నాయకులు

సూళ్లూరుపేట నియోజకవర్గం, దొరవారి సత్రం మండలం అయ్యపాలెం, అక్రపాక, గ్రామాల్లో పర్యటించిన నెల్లూరు జిల్లా సంయుక్త కార్యదర్శి శ్రీ బురకాల లీలామోహన్, సూళ్లూరుపేట నియోజకవర్గం వీరమహిళా నాయకురాలు బురకాల గీతాంజలి అక్కడ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ఇంటి ఇంటికి వెళ్లి తెలుసుకోవడం జరిగింది. వారు అయ్య పాలెంలో ప్రధానంగా ఎదుర్కొంటున్న సమస్యలు అయినటువంటి రోడ్లు, డ్రైనేజీ కాలువలు, డయాలసిస్, క్యాన్సర్ వృద్ధులకు పింఛన్లు, వాటర్, ఇళ్ల సమస్యలు చెప్పడం జరిగింది. ఈ సమస్యలన్నింటినీ అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం చేసే విధంగా హామీ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో సైనికులు పవన్ కళ్యాణ్, ప్రశాంత్, యోగేష్, సన్నీ, ముని రాజా జనసైనికులు పాల్గొన్నారు.