ప్రమాదవశాత్తు మరణించిన జనసైనికుని కుటుంబానికి జనసేన పరామర్శ
అరకు నియోజకవర్గం అనంతగిరి మండలంలో చిటమ్ మురళి ఆధ్వర్యంలో జనసేన పార్టీ నియోజకవర్గ స్థాయి నాయకులు మరియు మండల నాయకులు అనంతగిరి మండలం కొత్తూరు పంచాయతీ కొత్తూరు గ్రామంలో పల్లి కనకరావు.. తండ్రి వీరన్న దొర (లేటు) అనే జనసైనికుడు జనసేన పార్టీలో క్రియాశీలక సభ్యత్వము తీసుకున్నాడు. అయితే ఇటీవల ప్రమాదవశాత్తు చెట్టు మీద నుంచి కింద పడి మరణించడం జరిగింది. అనంతగిరి మండలం జనసేన పార్టీ నాయకులు, నియోజవర్గం స్థాయి నాయకులు కొత్తూరు గ్రామంలో ఆ బాధితురాలిని పరామర్శించడం జరిగింది. ఈ కార్యక్రమంలో అరకు నియోజకవర్గ స్థాయి నాయకులు కొర ప్రవీణ్, కొనేడీ లక్ష్మణరావు, బంగారు రామదాసు, ముల్లంగి శ్రీనివాస్ రెడ్డి, సంతోష్ సింగ్, అనంతగిరి మండల నాయకులు విజయ్ కుమార్ రాజా మరియు తదితరులు పాల్గొన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/05/WhatsApp-Image-2022-05-05-at-8.15.57-PM.jpeg)