కోర్టు వాయిదాకు హాజరైన జనసేన నాయకులు

కాకినాడ రూరల్: 2020 జనవరి 12వ తేదీన కాకినాడలో జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పై ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలపై నిరసన తెలుపుతున్న జనసేన శ్రేణులపై వైసీపీ నాయకులు, కార్యకర్తలు దాడి చేసి అక్రమంగా కేసులు బనాయించిన సంగతి అందరికీ విదితమే. ఆ కేసుల నిమిత్తం కాకినాడ జిల్లా కోర్టు వాయిదాకు మంగళవారం జనసేన నాయకులు హాజరయ్యారు. నాలుగు సంవత్సరాలనుండి కోర్టు వాయిదాలకు న్యాయస్థానాలపై ఉన్న గౌరవంతో హాజరువుతున్నామని జనసేన పార్టీ పీఏసీ సభ్యులు కాకినాడ రూరల్ ఇంచార్జ్ పంతం నానాజీ, అమలాపురం ఇంచార్జ్ శెట్టిబత్తుల రాజబాబు తెలిపారు. ఈ వాయిదాలకి రాష్ట్ర కార్యదర్శి గంట స్వరూప, తూము బన్ను, కర్ని శ్రీనివాస్ నాయుడు తదితరులు హాజరైనారు. ఈ కార్యక్రమంలో పుల్లశ్రీరాములు, దాసరి శివ, పోసిన రాము, తురగా సంతోష్, బోగిరెడ్డి గంగాధర్, బిరుద బాబు, మల్లేష్ పాల్గొన్నారు.