కౌలురైతు భరోసా యాత్రకి విరాళమిచ్చిన జనసేన నాయకులు

తూర్పుగోదావరి జిల్లా, రాజోలు నియోజకవర్గం మలికిపురంలో జనసేనపార్టీ జిల్లా కార్యవర్గ సమావేశం జిల్లా అధ్యక్షులు కందుల దుర్గేష్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో పాల్గొన్న జనసేన పార్టీ పిఏసి సభ్యులు, కాకినాడ రూరల్ ఇంచార్జ్ పంతం నానాజీ. ఈ సమావేశంలో రాష్ట్ర అధ్యక్షులు పవన్ కళ్యాణ్ చేపట్టిన కౌలురైతు భరోసా కార్యక్రమానికి పంతం నానాజీ ఆధ్వర్యంలో తమవంతు సహాయాన్ని

  1. కాకినాడ రూరల్ నియోజకవర్గం నాయకులు బోగిరెడ్డి కొండబాబు లక్ష(100000)రూపాయలు.
  2. జిల్లా ప్రధాన కార్యదర్శి శిరంగు శ్రీనివాస్ 25000 రూపాయలు,
  3. కాకినాడ రూరల్ మండల అధ్యక్షులు కరెడ్ల గోవింద్ 20000 రుపాయలు

జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుల వారికి అందించడం జరిగింది. వీరందరికి అభినందనలు తెలియచేసిన పంతం నానాజీ. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు మరియు జనసైనికులు పాల్గొనడం జరిగింది.