పలుకుటుంబాలకు మనోధైర్యాన్నిచ్చిన జనసేన నాయకులు

  • క్యాన్సర్ తో బాధపడుతున్న వ్యక్తికి 10 వేల ఆర్ధికసాయం

అమలాపురం, క్యాన్సర్ తో బాధపడుతున్న అమలాపురం మండలం జనుపల్లి గ్రామానికి చెందిన గోకరకొండ ఆనంద్ ను పరామర్శించిన
జనసేన పార్టీ పార్లమెంటరీ నియోజకవర్గ ఇంచార్జి డి.ఎం.ఆర్ శేఖర్. ఆనంద్ వైద్య ఖర్చులు నిమిత్తం డి.ఎం.ఆర్ శేఖర్, లింగోలు పండు 10,000 వేల రూపాయలు వారి కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ యాళ్ళ నాగ సతీష్, డాక్టర్ సెల్ రాష్ట్ర కార్యదర్శి శ్రీమతి కొప్పుల నాగ మానస, సీనియర్ నాయకులు కంచిపల్లి అబ్బులు, పట్టణ మరియు రూరల్ మండల నాయకులు సర్పంచ్ లు ఉపసర్పంచ్ లు ఎంపీటీసీలు వార్డు మెంబర్లు మరియు జనసైనికులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

అమలాపురం, ఇటీవలే రోడ్డు ప్రమాదంలో గాయపడిన అమలాపురం రూరల్ మండలం సమనస గ్రామ జనసైనికుడు మానేపల్లి సీతారాం(రాము)ను పరామర్శించిన అమలపురం జనసేన పార్టీ పార్లమెంటరీ నియోజకవర్గ ఇంచార్జి డి.ఎం.ఆర్ శేఖర్ సీనియర్ నాయకులు ఇసుక పట్ల రఘుబాబు, లింగోలు పండు, మాజీ మున్సిపల్ చైర్మన్ యాళ్ళ నాగ సతీష్, డాక్టర్ సెల్ రాష్ట్ర కార్యదర్శి శ్రీమతి కొప్పుల నాగ మానస, మునిసిపల్ కౌన్సిలర్ లు, సర్పంచ్ లు, ఉపసర్పంచ్ పట్టణ మరియు రూరల్ మండల నాయకులు ఎంపీటీసీలు వార్డు సభ్యులు మరియు జనసైనికులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

అమలాపురం రూరల్ మండలం రంగాపురం గ్రామంలో ప్రమాదవశాత్తు గాయపడిన ఉందుర్తి వెంకటేశ్వరావుని పరామర్శించిన జనసేన పార్టీ అమలాపురం పార్లమెంటరీ నియోజకవర్గ ఇంచార్జి డి.ఎం.ఆర్ శేఖర్ జనసేన పార్టీ తరపున 15 రోజులు ఫిజియోథెరపీ చేస్తామని తెలియజేసిన డాక్టర్ సెల్ రాష్ట్ర కార్యదర్శి శ్రీమతి కొప్పుల నాగ మానస. ఈ సందర్భంగా నాయకులు లింగోలు పండు, మాజీ మున్సిపల్ చైర్మన్ శ్రీ యాళ్ళ నాగ సతీష్ ఆర్థిక సాయం అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో అమలాపురం పట్టణ మరియు రూరల్ మండల నాయకులు మునిసిపల్ కౌన్సిలర్స్ సర్పంచ్ లు ఉపసర్పంచ్ లు ఎంపీటీసీలు వార్డు సభ్యులు, జనసైనికులు పాల్గొన్నారు.