నర్సంపేట పోలీస్ అధికారులను కలిసిన జనసేన నేతలు

నర్సంపేట నియోజవర్గం: ఇటీవల నర్సంపేట ఏసీపీగా బాధ్యతలు చేపట్టిన పుప్పాల తిరుమల్, సిఐ సుంకరి రవికుమార్, ఎస్సైలు శీలం రవి యాదవ్ మరియు వలిశెట్టి చరణ్ లను జనసేన పార్టీ నర్సంపేట నియోజకవర్గ ఇంచార్జ్ మేరుగు శివ కోటి యాదవ్ మరియు మండల నాయకులు గౌరపూర్వకంగా కలిసి శాలువాతో సన్మానించి, పూల బోకే, డైరీలను అందించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా శివకోటి యాదవ్ మాట్లాడుతూ శాంతి భద్రతల పరిరక్షణలో జనసేన పార్టీ పోలీసులకు తమ వంతుగా సహకరిస్తుందని పేర్కొన్నారు. అలాగే తమ దృష్టికి వచ్చిన ప్రజా సమస్యల పరిష్కారానికి పోలీసులు తోడ్పాటు అందించాలని ఏసిపిని, ఇతర అధికారులను కోరారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు ఒర్సు రాజేందర్, బొబ్బ పృథ్వీరాజ్, షేక్ హుస్సేన్ పాషా, ఎల బోయిన డేవిడ్ రాజ్ లు పాల్గొన్నారు.