ఎస్సై సాయి కిషోర్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన జనసేన నాయకులు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, ములకలపల్లి మండల పోలీస్ స్టేషన్ నందు కొత్తగా బాధ్యతలు చేపట్టిన ఎస్సై సాయి కిషోర్ రెడ్డిని జనసేన నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి, శాలువాతో సత్కరించి, సాదర స్వాగతం పలకడం జరిగింది. ఎస్సై సాయి కిషోర్ రెడ్డి మాట్లాడుతూ.. మీ సహాయ సహకారాలు మా పోలీస్ డిపార్ట్ మెంట్ కు ఉండాలి అని వారు తెలియ జేయగా, పోలీస్ వ్యవస్థ పట్ల మా జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు సానుకూలదృక్పధంతో వ్యవహారిస్తారని, పోలీస్ అధికారులకు మా పార్టీ అన్ని విధాలుగా సహకారం ఎల్లపుడు అందిస్తుంది అని జనసేన నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ జిల్లా నాయకులు గరికే రాంబాబు, గొల్ల వీరభద్రం, మండల అధ్యక్షులు తాటికొండ ప్రవీణ్, మండల నాయకులు బొక్క వెంకటేశ్వర్లు, కందుకూరి వినీత్, తదితరులు పాల్గొన్నారు.