ఆక్సిడెంట్ గురైన జనసైనికుడిని కలిసిన జనసేన నాయకులు

ప్రకాశం జిల్లా, గిద్దలూరు నియోజకవర్గం జనసేన ఇన్చార్జి బెల్లంకొండ సాయిబాబు ఆదేశాల మేరకు కంభం మండలం, ఎర్రబాలెం గ్రామంలో పర్యటించిన జనసేన నాయకులు. జనసేన కార్యకర్త యెనుముల నారాయణ బైక్ స్కిడ్ కావడం వలన క్రింద పడి గాయపడడం జరిగినది. యెనుముల నారాయణను కలసి పరామర్శించి సంఘటన వివరాలు తెలుసుకొన్న జిల్లా కార్యదర్శి లంకా నరసింహరావు, జిల్లా సంయుక్త కార్యదర్శి కాల్వ బాల రంగయ్య, కంభం మండలం అధ్యక్షుడు తాడిశెట్టి ప్రసాద్ చేతులు. వీరి చేతుల మీదుగా ₹5000 ఆర్ధిక సహాయం అందించడం జరిగింది. పార్టీ తరపున సభ్యత్వం ఇన్సూరెన్స్ కంపెనీ పత్రాలు అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో కంభం మండలం నాయకులు సందు నారాయణ, నల్లబోతుల మస్తాన్, ఇట్టె విశ్వనాథ్, పిక్కిలి కాశయ్య, నళ్ళబోతుల. అనిల్ కుమార్, గత్తు అనంత రాయుడు, నాళ్ళబోతుల భరత్ తదితరులు పాల్గొన్నారు.