అగ్నిప్రమాద బాధితులకు అండగా నిలచిన జనసేన నాయకులు

పాయకరావుపేట నియోజకవర్గం, కోటఉరట్ల మండలం సుంకపూర్ గ్రామంలో ప్రమాదవశాత్తూ అగ్నిప్రమాదంలో పూరిల్లు దగ్ధమైనది. విషయం తెలుసుకొన్న సుంకపూరు జనసేన నాయకులు సింగంపల్లి శ్రీను ఆధ్వర్యంలో నిరాశ్రయ కుటుంబానికి బియ్యం, నిత్యావసర వస్తువులు, దుప్పట్లు జనసేన సీనియర్ నేత గెడ్డం బుజ్జి చేతుల మీదుగా అందజేయడం జరిగింది. అనంతరం సుంకపూర్ లో ఏర్పాటు చేసినటువంటి పార్టీ కార్యాలయాన్ని సందర్శించారు. ఈ యొక్క కార్యక్రమంలో కోటఉరట్ల మండల అధ్యక్షుడు బద్రి, మరియు రత్నాజీ, జక్కన్న దొర, రవికుమార్ బోడపాటి, పవన్, దుర్గ పాల్గొన్నారు.