కిడ్నీ బాధితుడికి అండగా నిలిచిన జనసేన నాయకులు

గన్నవరం నియోజకవర్గం జనసేన పార్టీ తరపున మచిలీపట్నంలో నివాసం ఉంటున్న ఇల్లూరి వీరబాబు కోబ్బరి కాయలు అమ్ముకుంటూ జీవనం సాగించేవారు వారికి చాణిక్య అనే ఒక సంవత్సరం బాబు వున్నాడు ఆ బాబుకి ఈ మధ్యకాలంలో ఆరోగ్యం సరిగ్గా లేకపోవడం కారణంగా హాస్పిటల్ కి తీసుకువెళ్తే.. డాక్టర్లు టెస్టులు చేసి బాబు కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నాడు.. కిడ్నీ పూర్తిగా చెడిపోయింది వెంటనే కిడ్నీ తీసేయాలి అని చెప్పటం జరిగింది. దీనికి దాదాపుగా ఆరు లక్షల ఖర్చు అవుతుంది అని డాక్టర్లు తెలియజేశారు. ఆ సమయంలో ఆ బాబు తండ్రి జనసేన పార్టీ నాయకులు గుంటుపల్లి హర్ష నీ సంప్రదించడం జరిగింది. గుంటుపల్లి హర్ష తన స్నేహితుల ద్వారా కార్యకర్తల ద్వారా అందరికీ తెలియజేసి రెండు సార్లు గా 60000 విరాళాలు సేకరించి.. ఆ బాబు తండ్రికీ అందచేయటం జరిగింది. జనసేన పార్టీ విజయవాడ రూరల్ మండల అధ్యక్షుడు పొదిలి దుర్గారావు ఆధ్వర్యంలో 10 వేల రూపాయలు ఆర్థిక సహాయం అందించారు. ఈ కార్యక్రమానికి జనసేన నాయకులు లంకే సురేష్, జనసేన వీర మహిళా మేకల స్వాతి మరియు గన్నవరం నియోజకవర్గం జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆ బాబు కుటుంబానికి ఎప్పుడు అండగా వుంటామని వారికి భరోసా ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో సహాయ సహకారాలు అందించిన ప్రతి ఒక్కరికి జనసేన పార్టీ తరపున దన్యవాదాలు తెలియజేడం జరిగింది.