గిరిజన మహిళకు అండగా నిలచిన జనసేన నేతలు

ఒక గిరిజన మహిళ తన బిడ్డ పెళ్లి పనుల కోసం ఆగస్టు 15వ తారీఖున హైదరాబాద్ కి రావడం జరిగింది. అకారణంగా ఆ గిరిజన మహిళను పోలీసులు ప్రాస్టిట్యూట్ అని చెప్పి పోలీస్ స్టేషన్ కి తరలించి రెండు రోజులు విచక్షణా రహితంగా ఆమెపై దాడి చేసి తన దగ్గర ఉన్న బంగారం, డబ్బులు కూడా తీసుకున్నారన్న విషయం జనసేన పార్టీ వైరా నియోజకవర్గ ఇంఛార్జి సంపత్ నాయక్ దృష్టికి రాగానే వెంటనే ఆయన ఎల్బి నగర్ పోలీస్ స్టేషన్ కి వెళ్ళడం జరిగింది. బాధిత మహిళను పరామర్శించి, ఈ ఘటనకు పాల్పడిన పోలీసులను వెంటనే సస్పెండ్ చేయాలని, ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టాలని జనసేన పార్టీ తరుపున డిమాండ్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ ఎల్బి నగర్ నియోజకవర్గ ఇంఛార్జి శ్రీమతి సాయి శిరీష పొన్నూరు, ఓయూ నేత వినోద్ నాయక్, గిరిజన సంఘ నాయకులు, జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు తదితరులు పాల్గొన్నారు.