అనాధలైన చిన్నారులకు అండగా నిలిచిన జనసేన నాయకులు

లోతుగడ్డ పంచాయితీ రామారావుపాలెంలో మద్యం మత్తులో భార్యని కడతేర్చి తాను ఆత్మహత్య చేసుకుని తనువు చాలించిన కుటుంబాన్ని పరామర్శించి అనాధలు అయిన చిన్నారులని పరామర్శించి తనవంతు మానవతా దృక్పధంతో నగదు సహాయం చేసిన జనసేన పార్టీ ఇన్చార్జి డాక్టర్ శ్రీ వంపూరు గంగులయ్య. మద్యం మత్తులో క్షణికవేశాలుతో జీవితాలను ఛిద్రం చేసుకోవద్దు మద్యం మత్తులో అభం శుభం తెలియని పసిపిల్లలను అనాధలు చెయ్యొద్దు అంటూ తన గిరిజన ప్రజలను ఉద్దేశించి చెప్పారు, మా భవిష్యత్ ఏమిటంటూ అమాయకంగా చూస్తున్న ఆ పసిపిల్లలను చూసి పలువురు కంటతడి పెట్టారు.