అక్రమ తరలింపులను అడ్డుకున్న జనసేన నాయకులు

పోలవరం: గురువారం జీలుగుమిల్లిలో తెల్లవారు జామున అక్రమంగా పత్రాలు లేకుండా తరలిస్తున్న 3 పది టైర్ల టిప్పర్లను, కార్ ను పోలవరం నియోజకవర్గం జనసేన ఇంచార్జి చిర్రి బాలరాజు, మండల అధ్యక్షులు పసుపులేటి రాము ఆధ్వర్యంలో అడ్డుకోవడం జరిగింది. రుద్రమకోట నుండి అక్రమంగా తరలిస్తున్నారని సరైన పత్రాలు లేవని, పరిమితికి మించి ఎక్కువ బరువుతో వెళ్తున్నాయని స్థానిక పోలీసుస్టేషన్ లో అలాగే ఆర్.టి.ఓ అధికారులకు తెలియచెయ్యడం జరిగిందని, వాహనాలపై కేసులు నమోదు చేయించామని, రెండురోజుల్లో సంబంధిత ఇసుక రాంప్ కి వెళ్లి పూర్తి స్థాయిలో పరిశీలించి వాటికీ సంబంధిత అనుమతులు ఉన్నాయా లేవా పరిశీలిస్తామని.. వేలేరుపాడు మండల అధ్యక్షులు గణేసులు ఆది నారాయణ గారు ఇసుక రాంప్ లో తవ్వకాలు అడ్డుకున్నందుకే వారిపై దాడి చేసారని, రుద్రమకోటలో ఇసుక తవ్వకాలు జరగడం లేదని చెప్పినవారు వీటికి ఎం సమాధానం చెప్తారని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో కోలా మధు, మూర్తి, సతీష్, వెంకటేష్, సంజయ్, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.