జనసేన ఆధ్వర్యంలో పెయిడ్ పార్కింగ్ మరియు ఆస్తిపన్ను పెంపుపై నిరసన

రాజమహేంద్రవరంలో మున్సిపల్ కార్పోరేషన్ అధ్యక్షులు వై.శ్రీనివాస్ ఆద్వర్యంలో పెయిడ్ పార్కింగ్ మరియు ఆస్తిపన్ను పెంపుపై నిరసన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అనంతరం కమీషనర్ కు వినతిపత్రం అందజేయడం జరిగింది. ఈ కార్యాక్రమానికి ముఖ్య అతిధిగా తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు కందుల దుర్గేష్ హాజరవగా నగర ఇంచార్జ్ అనుశ్రీ సత్యనారాయణ, రాష్ట్ర లీగల్ సెల్ ఉపాధ్యక్షులు ఆవ్ణ్శ్ రామచంద్రరావు మరియు జిల్లా నాయకులు, నగర కమిటీ నాయకులు, వీరమహిళలు, జనసైనికులు తదితరులు పాల్గొన్నారు.