గాడాల గ్రామంలో జనంకోసం జనసేన మహా పాదయాత్ర
రాజానగరం జనసేన నాయకులు బత్తుల బలరామకృష్ణ ఆధ్వర్యంలో జరుగుతున్న “జనంకోసం జనసేన మహాపాదయాత్ర” ఆదివారం కోరుకొండ మండలం గాడాల గ్రామంలో నిర్వహించడం జరిగింది. గాడాల గ్రామ ప్రజలు బత్తుల దంపతులకు హరతులు, పూల వర్షాలతో ఘనస్వాగతం పలికడం జరిగింది. మొదటగా గ్రామంలో ఉన్న దేవాలయాలను దర్శించి ఆ దేవుని ఆశీర్వాదములతో పాదయాత్రని బత్తుల బలరామకృష్ణ శ్రీమతి వెంకటలక్ష్మి దంపతులు ప్రారంభించడం జరిగింది. గ్రామంలో గడప గడపకు తిరుగుతూ ప్రతి ఒక్కరినీ ఆప్యాయంగా పలకరిస్తూ ప్రజలు ఈ ప్రభుత్వంలో ఎదుర్కొంటున్న సమస్యలు తెలుసుకుంటూ జనసేన ప్రభుత్వం వచ్చిన వెంటనే సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇవ్వడం జరిగింది. గ్రామంలో ఇంటింటికీ తిరుగుతూ జనసేన పార్టీ కరపత్రం, బ్యాడ్జ్, కీ-చైన్ ఇస్తూ ఈసారి “గాజు గ్లాసు” గుర్తుపై ఓటు వేసి జనసేన పార్టీని గెలిపించి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను ముఖ్యమంత్రిని చేయాలని అభ్యర్థించారు. ఈ పాదయాత్రలో వీరితో పాటు జనసేన సీనియర్ నాయకులు, జనసైనికులు, వీరమహిళలు భారీగా పాల్గొన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/05/WhatsApp-Image-2023-05-14-at-21.56.56-1024x682.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/05/WhatsApp-Image-2023-05-14-at-21.56.51-1024x682.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/05/WhatsApp-Image-2023-05-14-at-21.56.55-1024x682.jpeg)