జనసేన “మహా సంకల్ప యాత్ర”

అమలాపురం నియోజకవర్గం: జనసేన పార్టీ యొక్క మ్యానిఫెస్టోని, అధ్యక్షులు పవన్ కల్యాణ్ మనోగతాన్ని నియోజకవర్గ ప్రజలకు తెలియచేస్తూ, పార్టీ యొక్క క్రియాశీలక సభ్యత్వాన్ని మరింత ముందుకు తీసుకెళ్లే విధంగా ప్రతి గ్రామంలో ఇంటి ఇంటికి వెళ్ళి పవన్ కళ్యాణ్ గారికి ఒక్క అవకాశం ఇవ్వమని ప్రచారం చేసే కార్యక్రమాన్ని బుధవారం జనసేన పార్టీ నాయకులు లింగోలు పండు ఆధ్వర్యంలో అమలాపురం జనసేన ప్రాంగణం వద్ద (నల్లా శ్రీధర్ ఇంటి వద్ద) ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో నల్లా శ్రీధర్, మాజీ మున్సిపల్ చైర్మన్ యాళ్ల సతీష్, ఇసుకపట్ల రఘుబాబు, అయితబత్తుల ఉమామహేశ్వర రావు, కంచిపల్లి అబ్బులు, పడాల నానాజీ, వాకపల్లి వేంకటేశ్వర రావు, తిక్కా సరస్వతి, పోలిశెట్టి చిన్ని, ఆకుల సూర్యనారాయణ మూర్తి, బట్టు పండు, ఆర్.డి.యస్. ప్రసాద్, హనుమాన్ బుజ్జి, వానపల్లి దేవి, కరాటపు వాణి, కర్రి లక్ష్మి దుర్గ మరియు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.