నరేంద్రపురంలో జనం కోసం జనసేన మహాపాదయాత్ర

  • అవినీతి అరాచక పాలనను అంతమొందించి ప్రజా పరిపాలన తెచ్చుకుందాం
  • పవన్ కళ్యాణ్ నాయకత్వంలో మన ఆంధ్ర రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దుకుందాం

రాజానగరం నియోజకవర్గం: రాజానగరం మండలం నరేంద్రపురం గ్రామంలో జనం కోసం జనసేన మహాపాదయాత్రలో భాగంగా జనసేన పార్టీ ఇంచార్జి బత్తుల బలరామకృష్ణ, నా సేన కోసం నా వంతు కో-ఆర్డినేటర్ శ్రీమతి బత్తుల వెంకటలక్ష్మికి నరేంద్రపురం ప్రజానీకం బ్రహ్మరధం పట్టారు. అడుగడుగునా హారతులు పడుతూ, తీన్మార్ డప్పులతో జనశ్రేణులు, ప్రజలు ఘన స్వాగతం పలికారు. కార్యక్రమంలో బాగంగా బత్తుల గ్రామంలో వంగవీటి రంగా విగ్రహానికి పూల మాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం నరేంద్రపురం గ్రామ జనసేన నాయకులు, జనసైనికులు, గ్రామ ప్రజలు బత్తుల దంపతులకు చిరు సత్కారం చేసారు.