సీతానగరంలో జనం కోసం జనసేన మహాపాదయాత్ర

  • సీతానగరం గ్రామంలో అడుగడుగునా జననీరాజనాలతో ముందుకు సాగిన పాదయాత్ర
  • బత్తులతోనే మా ప్రయాణం అంటూ వేలాదిగా తరలివస్తున్న ప్రజలు
  • తీన్మార్ డప్పులు, బాణాసంచాతో, పూల వర్షం కురిపిస్తూ ఆడపడుచులు హారతులు పడుతూ అఖండ స్వాగతం పలికిన ప్రజానీకం
  • అధికార వైస్సార్సీపీ ప్రభుత్వం పై ప్రజల్లో పెరుగుతున్న వ్యతిరేకత
  • రాజానగరం నియోజకవర్గంలో వైస్సార్సీపీ పూర్తిగా భూ స్థాపితం అయ్యిందనడానికి నిదర్శనం పాదయాత్రకి భారీగా తరలివచ్చిన జనం
  • జనసేన – తెలుగుదేశం పార్టీ నాయకులతో భారీ జనసంద్రోహంగా పాదయాత్ర ముందుకు సాగింది
  • ముందుగా గ్రామంలోని శివాలయంలో స్వామి వారిని దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని ఆకాం క్షించిన బత్తుల

రాజానగరం నియోజకవర్గం: రానున్న ఎన్నికలలో గెలుపే లక్ష్యంగా జనసేన పార్టీ ఆశయాలు సిద్దాంతాలు ప్రజలకు చేరువచేస్తూ… సీతానగరం మండలం, సీతానగరం గ్రామంలో ప్రతీ ఇంటికీ తిరుగుతూ… ప్రతీ ఒక్కరినీ ఆప్యాయంగా పలకరిస్తూ.. రాష్ట్రంలో రాక్షస పాలన చేస్తున్న ఈ దుర్మార్గపు దుష్ట వైస్సార్సీపీని తరిమికొట్టి ప్రజా పరిపాలన తీసుకురావడానికి.. మన తరువాతి తరాల భవిష్యత్తును బంగారు భవిష్యత్తుగా మార్చుకోవడానికి ఒక్కసారి జనసేన పార్టీకి అవకాశం ఇవ్వాలని.. మన ఆశలకు, ఆకాంక్షలకు వారధి రాజానగరం నియోజకవర్గం అభివృద్ధి చెందడానికి మన బత్తుల బలరామకృష్ణగారిని అఖండ మెజారిటీతో గెలిపించండి అని అభ్యర్థిస్తూ జనసేన పార్టీ కరపత్రం, బ్యాడ్జ్, కీచైన్ అందజేసిన నా సేన కోసం నా వంతు కమిటీ సభ్యురాలు శ్రీమతి బత్తుల వెంకటలక్ష్మి, యువజన నాయకులు తోట పవన్ కుమార్, వీరమహిళా సాధికార కమిటీ కో-ఆర్డినేటర్ శ్రీమతి తోట ప్రత్యూష దేవి.. ఈ కార్యక్రమంలో జనసేన- తెలుగుదేశం పార్టీ నాయకులు, జనసైనికులు, కార్యకర్తలు, వీరమహిళలు, గ్రామ ప్రజలు భారీగా పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *