జీలుగుమిల్లిలో జనసేన మండల స్థాయి సమీక్షా సమావేశం

పోలవరం నియోజకవర్గం: జీలుగుమిల్లి మండల కేంద్రంలో జనసేన పార్టీ కార్యాలయం వద్ద మండల అధ్యక్షులు పసుపులేటి రాము ఆధ్వర్యంలో మండల స్థాయిలో మండల కమిటీ, గ్రామ కమిటీ మరియు క్రియాశీలక వాలంటీర్లు పార్టీ యాక్టివ్ పీపుల్స్ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా కార్యదర్శి గడ్డమణుగు రవి కుమార్, పోలవరం నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్చార్జి చిర్రి బాలరాజు పాల్గొన్నారు. మండల స్థాయి, గ్రామస్థాయిలో పార్టీ యొక్క బలోపేతం కోసం చేయవలసినటువంటి కార్యక్రమాలు భవిష్యత్ కార్యాచరణ గురించి మాట్లాడటం జరిగింది. ముఖ్య ఎజెండాలుగా ప్రతి కార్యకర్త ఇంటిపై జెండా ఎగరవెయ్యడం, ప్రతీ గ్రామంలో ఫ్లెక్సీలు వేసి నాయకత్వాన్ని బలపరుచుకోవడం,మండల కమిటీ సభ్యులు, గ్రామ కమిటీ సభ్యులు జనం కోసం జనసేన కార్యక్రమంలో భాగంగా రోజు సాయంత్రం 6 గంటలనుండి 8గంటలవరకు ప్రతి ఇంటికి వెళ్లి పార్టీ సిద్ధాంతాలు, పార్టీ సింబల్ గాజు గ్లాస్ గుర్తు తీసుకువెళ్లడం, బూత్ కమిటీలు నియామకాలు, టీడీపీ బీజేపీ నాయకుల వద్దకు వెళ్లి మాట్లాడి కలిసి పని చేసే విధంగా కార్యక్రమాలు, ఎస్సీ ఎస్టీ ల్లో ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా వాటిపై అవగాహన తీసుకురావడం, నాలుగున్నర సంవత్సరాల్లో చేసిన సేవ కార్యక్రమాలు ప్రజల్లోకి తీసుకువెళ్లడం, మేనిఫెస్టో అంశాలతోపాటు పంచాయితీ సమస్యలు ప్రజలకు వివరించడం, తదితర అంశాలపై చర్చించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల కమిటీ సభ్యులు, లీగల్ సెల్ కమిటీ సభ్యులు, గ్రామ కమిటీ సభ్యులు క్రియశీలక వాలంటీర్స్ పాల్గొన్నారు.