కోరుకొండ పార్టీ కార్యాలయంలో జనసేన సమావేశం
రాజానగరం నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జి మేడా గురుదత్త ప్రసాద్ ఆదేశాల మేరకు, కోరుకొండ మండల అధ్యక్షుడు మండపాక శ్రీను అధ్వర్యంలో కోరుకొండ మండల పరిధిలోని ఉన్న కమిటీ సభ్యులతో కోరుకొండ పార్టీ కార్యాలయం వద్ద సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం, మండల స్థాయిలో పార్టీని ఏ విధంగా ముందుకు తీసుకువెళ్ళాలి అనే దానిపై మరియు మండల పరిధిలో ఏ కార్యక్రమం జరిగినా ఈ కమిటి సభ్యులు హాజరు కావాలని చెప్పడం జరిగింది.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/03/WhatsApp-Image-2022-03-27-at-20.22.30-1-1024x768.jpeg)