క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యాచరణపై జనసేన సమావేశం

కళ్యాణదుర్గం: భారతదేశంలోనే ఏ రాజకీయ పార్టీ కార్యకర్తల సంక్షేమం కోసం తీసుకురాని బీమా పధకాన్ని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తీసుకొని వచ్చారు.. కార్యకర్తలకు భరోసాగా నిలబడినటువంటి ఏకైక రాజకీయ పార్టీ జనసేన పార్టీ కార్యకర్తల సంక్షేమం కోసం క్రియాశీలక సభ్యత్వం ఇన్సూరెన్స్ పాలసీ తీసుకొని వచ్చింది.. 500 రూపాయలు చెల్లించి సభ్యత్వం తీసుకున్న సభ్యులకు అనుకోని సంఘటనల వల్ల ప్రమాదాలకు గురి అయితే హాస్పిటల్ ఖర్చుల నిమిత్తం 50 వేల రూపాయలు ప్రమాదవశాత్తు మరణించిన ఎడల 5 లక్షలు వారి కుటుంబ సభ్యులకు అందజేయడం జరుగుతుంది.. జనసేన పార్టీకి కార్యకర్తలే బలం.. వారే పార్టీ సంపద.. జనసైనికుల కుటుంబాలకు భరోసా కల్పించేలా, ప్రమాదవశాత్తు గాయపడిన వారిని ఆదుకునేందుకు ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన జనసేన పార్టీ మూడవ విడత క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమం ఫిబ్రవరి 10 నుండి 28 వరకు జనరగనున్నది… ఈ నేపథ్యంలో పార్టీ నాయకులు సమీక్ష సమావేశం నిర్వహించారు. సమావేసంలో భాగంగా కళ్యాణదుర్గం నియోజకవర్గంలోని జనసేన నాయకులు సమావేశమై క్రియాశీలక సభ్యత్వం వాలెంటరు లిస్టు తయారుచేసి జిల్లా అధ్యక్షులు టి.సి వరుణ్ గారికి అందజేయడం జరుగుతుంది… కళ్యాణదుర్గం నియోజకవర్గంలోని ఇప్పటివరకు నమోదైన వారి సభ్యత్వాన్ని రెన్యువల్ చేయించుకోవాలి, సభ్యత్వం తీసుకొని వారు కొత్తగా సభ్యత్వం తీసుకోవాలి విజ్ఞప్తి చేస్తున్నారు. ఇప్పటివరకు ప్రమాదంలో గాయపడిన 169 సభ్యులకు 60,90,781 రూపాయలు, ప్రమాదవశాత్తు మరణించిన వారి కుటుంబాలకు 96 మంది సభ్యులకు 4 కోట్ల, 80 లక్షల  రూపాయలు వారి కుటుంబ సభ్యులకు అందజేయడం జరిగింది… మొత్తం 5,40,90,781 రూపాయలు జనసేన పార్టీ కార్యకర్తలకు జనసేన పార్టీ అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ అందజేసారు. ఈ కార్యక్రమంలో అనంతపురం జిల్లా కార్యదర్శి లక్ష్మీనరసయ్య. సంయుక్త కార్యదర్శి బాల్యం రాజేష్, జనసేన నాయకులు వంశీకృష్ణ, జాకీర్, సయ్యద్ కంబదూరు మండలం ప్రధాన కార్యదర్శి వెంకటేశులు, సురేష్ మొదలైన జనసైనికులు పాల్గొనడం జరిగింది.