అంబేద్కర్ ఆశయాలనే ప్రధాన ఎజెండాగా జనసేన పయనిస్తుంది
బడుగుబలహీన వర్గాల ఆశాజ్యోతి డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ అని ఆమదాలవలస నియోజికవర్గ జనసేన ఇంచార్జ్ పేడాడ రామ్మోహన్ రావు అన్నారు. గురువారం నాడు డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ 131వ జయంతి సందర్భంగా ఆముదాలవలస మున్సిపాలిటి పరిధిలో గల అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. భారత రాజ్యంగ నిర్మాత, సమ సమాజ స్థాపికుడు అంబేద్కర్ అని ఈ సందర్భంగా రామ్మోహన్ కొనియాడారు. అంబేద్కర్ ఆశయాలనే ప్రధాన ఎజెండాగా జనసేన పయనిస్తుందని స్పష్టం చేశారు. కేవలం జయంతి, వర్దంతి రోజులనాడు అంబేద్కర్ ను స్మరించుకోవడం కాకుండా.. నిత్యం ఆయన ఆశయ సాధనకు అందరూ కృషిచెయ్యాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంపిటిసి సభ్యులు అంపిలి విక్రం, కొత్తకోట నాగేంద్ర, ఆమదాలవలస పట్టణ జనసేన నాయకులు గణేష్, రాము, కోటేశ్వరరావు, అశోక్, సురేష్, శ్యామలరావు, శ్రీనివాసరావు, పవన్ కుమార్, బగాది ఫణి తదితరులు పాల్గొన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/04/WhatsApp-Image-2022-04-15-at-12.07.09-AM-1.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/04/WhatsApp-Image-2022-04-15-at-12.07.09-AM.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/04/WhatsApp-Image-2022-04-15-at-12.07.08-AM.jpeg)