వైద్యులను అభినందించిన జనసేన ఎంపిపి

రాజోలు, మల్కిపురం మండలం, లక్కవరం గవర్నమెంట్ హాస్పిటల్లో సోమవారం ఉదయం వైద్యుల విధులను పర్యవేక్షించిన జనసేన పార్టీ మల్కిపురం మండల ఎంపిపి మరియు లక్కవరం గవర్నమెంట్ హాస్పిటల్ ఛైర్మన్ శ్రీమతి మేడిచర్ల వెంకట సత్యవాణి రాము. అనంతరం గత 30 రోజుల్లో 30 కి పైగా ప్రసవాలు జరగగా ప్రతి ఒక తల్లి బిడ్డల యోగ క్షేమాలను పర్యవేక్షించి తదుపరి ఆసుపత్రి వైద్యులను మరియు సిబ్బందిని అభినందించడం జరిగింది.