కాకినాడ 33వ డివిజన్ లో జనసేన ముస్లిమ్ సచార్ యాత్ర

కాకినాడ సిటీ, జనసేన పార్టీ రాష్ట్ర రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులు మరియు కాకినాడ సిటీ ఇన్ఛార్జ్ ముత్తా శశిధర్ ఆలోచనలతో బుధవారం 33వ డివిజన్ రాఘవేంద్ర స్ట్రీట్, కామేశ్వర నగర్ ప్రాంతంలో జనసేన ముస్లిమ్ సచార్ యాత్ర డాక్టర్ బాబు ఆధ్వర్యంలో జరిగినది. ఈ ప్రాంతంలోని ముస్లిం ప్రజలతో డాక్టర్ బాబు కలిసి సంభాషించారు. ఈ యాత్రలో ఎండి.మెయినుద్దీన్ మాట్లాడుతూ ముస్లింల జీవన విధానంలో అన్నదమ్ములు, అక్కచెళ్ళెల్లు అందరు ఉమ్మడిగా ఉంటుంటారని దీనివల్ల కరెంటు వినియోగం పరిధి దాటడం వలన వీరికి వివిధ ప్రభుత్వ పధకాలలో చోటు దక్కడం లేదని ఆవేదన తెలియచేస్తున్నారనీ, ఇది పూర్తిగా ఈ వై.సి.పి ప్రభుత్వం ఆడుతున్న కపట నాటకం అని అన్నారు. ఈ వై.సి.పి ప్రభుత్వం కళ్ళుండీ కబోదిలా ముస్లిం సోదరీమణులకు ఒంటరి మహిళ పధకంలోను, షాదీముబారక్ పధకంలోను అన్యాయం చేస్తోందన్నారు. ఎన్నిసార్లు తాము ఈ దృతరాష్ట్ర ముఖ్యమంత్రికి మొరపెట్టుకున్నా ఫలితంలేదనీ, చెవిటోడు ముందు శంఖం ఊదినట్లు ఉందన్నారు. తమ పార్టీ ముస్లిం వర్గాల అభ్యున్నతికి అన్ని విధాలా తోడు ఉంటామని తమ నాయకుడు పవన్ కళ్యాణ్ లోగడ చెప్పిన విషయాన్ని ఈ సచార్ యాత్ర ద్వారా మరొక్కసారి గుర్తు చేసారు. ఈ కార్యక్రమంలో మహమ్మద్ మొయినుద్దీన్, ఎస్.కె కాశ్మూర్, ఎస్.కె షమీర్, షేక్ ఇమాం, సయ్యద్ బాజీ, ఎస్.కె బషీర్, దారపు సతీష్ తదితరులు పాల్గొన్నారు.