విశాఖ ఉక్కు-ఆంధ్రుల హక్కు డిజిటల్ క్యాంపెయిన్ లో పశ్చిమగోదావరి జిల్లా జనసేన

జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ పిలుపుమేరకు విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు డిజిటల్ క్యాంపెయిన్ లో భాగంగా పశ్చిమగోదావరి జిల్లా జనసేన నాయకులు మాట్లాడుతూ… 32 మంది బలిదానాలు కారణంగా ఏర్పడి, ప్రత్యక్షంగా పరోక్షంగా లక్షల మందికి జీవనోపాదిని కల్పిస్తున్న విశాఖ ఉక్కు ఖర్మాగారాన్ని ప్రైవేటీకరణ చేయకుండా అడ్డుకునే పూర్తి బాధ్యత ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎన్నుకున్న వైఎస్ఆర్ సీపీ ప్రభుత్వానిదే…ఆ పార్టీ తరపున లోక్ సభ కి ఎన్నికైన 22 మంది, రాజ్యసభకి ఎన్నికైన 6 గురు సభ్యులని ఈ విషయమై కేంద్ర ప్రభుత్వాన్ని అభ్యర్థిస్తూ పార్లమెంట్ లో ప్లకార్డులు ప్రదర్శించమని పశ్చిమగోదావరి జిల్లా జనసేన పార్టీ నాయకులందరమూ విజ్ఞప్తి చేస్తున్నామని పశ్చిమగోదావరి జిల్లా జనసేన నాయకులు తెలిపారు.