జనసేన కార్యాలయ ప్రారంభోత్సవం మరియు జెండా ఆవిష్కరణ

చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గం, పాకాల మండలం, దామలచెరువు పంచాయతీలో జనసేన పార్టీ నాయకులు కంచన శ్రీకాంత్, చిత్తూరు జిల్లా కార్యదర్శులు ఎం.నాసీర్ బాషా, కలప రవి, శ్రీమతి అరుణల ఆధ్వర్యంలో జనసేన పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవం మరియు జెండా ఆవిష్కరణ, చంద్రగిరి నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలతో ఆత్మీయ సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా జనసేన పార్టీ పిఏసి సభ్యులు, చిత్తూరు జిల్లా అధ్యక్షులు పసుపులేటి హరిప్రసాద్ పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమానికి చిత్తూరు జిల్లా జనసేన పార్టీ ఉపాధ్యక్షులు బత్తిన మధుబాబు, జీడీ నెల్లూరు నియోజకవర్గ ఇంచార్జ్ యుగంధర్ పొన్న, చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శి తులసి ప్రసాద్, జిల్లా కార్యదర్సులు ఆనంద్, బాటసారి, చంద్రగిరి నియోజకవర్గం 7 మండలాల అధ్యక్షులు గురునాథ్ తలారి, రాయల్ వెంకట్, కిషోర్, మురళి, జస్వంత్ (నాని), చంద్రగిరి సీనియర్ నాయకులు కృష్ణయ్య, ఈశ్వర్ రాయల్, మండల ఉపాధ్యక్షులు దినేష్, రాంబాబు, శ్రీమతి మంజుల వాణి, జనసేన సాయి, మండల కమిటీ సభ్యులు వాసు, రహంతుళ్ళ, షాజహాన్, భాను, రూపేష్, హరి, రవిప్రసాద్, అసిఫ్, చిత్తూరు జిల్లా కాపు సంక్షేమసేన అధ్యక్షులు రమేష్, పులిచర్ల మండల అధ్యక్షులు మోహన్ మరియు నాయకులు, జనసైనికులు, వీరమహిళలు పాల్గొన్నారు.