రెల్లి అక్క చెల్లమ్మల అభిమానం సంపాదించిన జనసేన పి.ఎస్.ఎన్ మూర్తి!!

  • పిఠాపురం జనసేన ఇంచార్జ్ ఉదయ్ శ్రీనువాస్ ఆదేశాలు మేరకు!!

పిఠాపురం నియోజకవర్గం: పిఠాపురం టౌన్ రెల్లి కాలనీ సమస్యలపై జనసేన గళం వినిపించింది. కాలువలపై వంతెనెలు కూల్చివేసి ఇబ్బందులకు గురిచేస్తున్నారని ప్రజలు వాపోయారు. మంచి నీరు త్రాగడానికి ఉన్నా బావిని శుభ్రం చేస్తే మేము త్రాగుతాము అని అక్క చెల్లమ్మలు ఆడగగా పి ఎస్ ఎన్ మూర్తి నేను నా సొంత ఖర్చులతో శుభ్రం చేయించి బావి చుట్టూరు పళ్లెం కట్టి ఇస్తాను అని మాట ఇచ్చారు. మహిళలు ఆనందంతో జే జే లు పలికారు. మేము జనసేనతో ప్రయాణం చేస్తాను అని పవన్ కళ్యాణ్ బాటలో మేము కూడా అన్నారు. ఈ కార్యక్రమంలో పిండి శ్రీను, కర్రి కాశీ, పెంకే జగదీష్, కోలా దుర్గాదేవి, ముప్పన రత్నం, తోట సతీష్, పబ్బిరెడ్డి ప్రసాద్ మరియు పి ఎస్ ఎన్ మూర్తి, నాయకులు, జనసైనికులు వీరమహిళలు తదితరులు పాల్గొన్నారు.