అమరవీరులకు నివాళులు అర్పించిన జనసేన

అమలాపురం, ఎస్పీ కార్యాలయం వద్ద జరిగిన పోలీసు అమర వీరుల సంస్మరణ దినోత్సవ వేడుకల్లో జనసేన పార్టీ నాయకులు డి.ఎం.ఆర్ శేఖర్ పాల్గొని అమర జ్యోతి స్థూపం వద్ద అమర వీరులకు నివాళులు అర్పించారు. అనంతరం ఇటీవల అమరులు అయిన పోలీసు కుటుంబాలకు 20,000/- ల విలువ గల గృహోపకరణాలు అందచేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ యాళ్ళ నాగ సతీష్, లింగోలు పండు, ఆకుల సూర్యనారాయణ మూర్తి, ఆర్.డి.ఎస్. ప్రసాద్, జనసేన పార్టీ డాక్టర్స్ సెల్ రాష్ట్ర కార్యదర్శి మానస, డి. భవాని శేఖర్, వాకపల్లి వేంకటేశ్వర రావు, పోలిశెట్టి చిన్ని, నల్లా వేంకటేశ్వరరావు, గంధం శ్రీను, వీర మహిళలు చాట్ల మంగతాయారు, తిక్కా సరస్వతి, కరాటం వాణి, వానపల్లి దేవి తదితరులు పాల్గొన్నారు.