మహనీయుడు అంబేద్కర్ జన్మదినం సందర్భంగా నివాళులు అర్పించిన జనసేన

పార్వతీపురం, భారత రాజ్యాంగ నిర్మాత బాబా సాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్బంగా ఆయన సేవల్ని గుర్తుచేసుకుంటూ పార్వతీపురం నియోజకవర్గం, సీతానగరం మండలం పరిధిలోలో జోగుంపేట గ్రామంలో గల అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి జనసేన నాయకులు నివాళులు అర్పించారు. జిల్లా కార్యక్రమాల నిర్వహణ కార్యదర్శి అల్లు రమేష్ మాట్లాడుతూ అంబేద్కర్ చాలా దూరదృష్టితో ప్రజలకు స్వేచ్చ, హక్కులు అవసరం అని ఆనాడు భారత రాజ్యాంగాన్ని రాయటం జరిగింది. అందరికీ సామాజిక న్యాయం జరగాలని బడుగు బలహీనవర్గాల అభ్యున్నతి కోసం రాజ్యాంగంలో పొందుపర్చారని, చట్టాన్ని చేయటం గొప్పకాదు దానిని అమలుచేయటమే గొప్ప విషయమని ఆనాడే ఆయన చెప్పటం జరిగిందని చెప్పారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రములో భారత రాజ్యాంగం అమలు కాకుండా ఫాసిజం సిద్ధాంతాలను అమలు చేస్తోంది ఈ ప్రభుత్వము అని మండిపడ్డారు. ప్రజాస్వామ్యం గాడి తప్పినట్టు చేశారనీ, బాబా సాహెబ్ ఆశయాలను ఆచరణలో పెట్టాలి అనుకునే వాళ్ళు అంతా ఒకతాటిపైకి వచ్చి ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగ విలువలను కాపాడాలని పిలుపునిచ్చారు. జనసేన పార్టీ బాబా సాహెబ్ ఆలోచన, ఆశయ సాధన దిశగా బడుగు, బలహీన వర్గాల కోసం పాటుపడుతుంది అని చెప్పటం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు మురళీ కోట్యాడ, కూడా కాళ్యంపుడి సత్యన్నారాయణ, భాస్కర్, ప్రకాష్, బాలకృష్ణ, అఖిల్, సంతోష్ మరియు జనసైనికులు పాల్గొన్నారు.