గొల్లపల్లిలో జనం కోసం జనసేన పల్లెబాట

మదనపల్లి నియోజకవర్గం: మదనపల్లి రూరల్ మండలంలో కట్టుబావి, గొల్లపల్లిలో జనం కోసం జనసేన పల్లెబాట కార్యక్రమంలో భాగంగా జనసేన పార్టీ రాయలసీమ కో కన్వీనర్ గంగారపు రాందాస్ చౌదరి ఆధ్వర్యంలో జనసేన నాయకులు కార్యకర్తలు, వీరమహిళలతో కలసి గొల్లపల్లిలో ఇంటి ఇంటికి కరపత్రాలు ఇచ్చి ప్రజల్లో పవనకళ్యాణ్ గారి పార్టీ సిద్ధాంతాలను గాజు గ్లాసు గుర్తును విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఉమ్మడి చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శి జంగాల శివరాం, జిల్లా జాయింట్ సెక్రటరీ గజ్జల రెడ్డెప్ప, టౌన్ ప్రెసిడెంట్ నాయని జగదీష్, రూరల్ మండల అధ్యక్షులు గ్రానైట్ బాబు, రెడ్డెమ్మ, కుమార్, చంద్రశేఖర, లవన్న, జనార్ధన్, నవాజ్, నారాయణ స్వామి, శంకర, రఘు రాములు, సత్య, అఖిల్ తదితరులు పాల్గొన్నారు.