ఉపాధ్యాయుల రిలే నిరాహార దీక్షకు మద్ధతుగా దీక్షలో పాల్గొన్న జనసేన

రాజమండ్రి, శ్రీ కందుకూరి వీరేశలింగం విద్యాసంస్థల నుంచి తొలగించబడిన దాదాపు 45 మంది అన్ అయిడెడ్
ఉపాధ్యాయులు 8 రోజులుగా చేపట్టిన రిలే నిరాహార దీక్షలకి సంఘీభావంగా శుక్రవారం దీక్ష చేపట్టిన రాజమహేంద్రవరం జనసేన పార్టీ నాయకులు. ఈ రిలే నిరాహార దీక్ష కార్యక్రమంలో వారికి మద్దతు తెలిపిన జనసేన పార్టీ తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు కందుల దుర్గేష్, జనసేన పార్టీ రాజమండ్రి సిటీ ఇంచార్జ్ సత్యనారయణ అత్తి, జనసేన పార్టీ నాయకులు, గెడ్డం నాగరాజు, దాసరి గుర్నాధరావు, సబ్బా రాజేష్ ఖన్నా, పైడి రాజు, రాజు అల్లాటి, చక్రపాణి, ప్రకాష్ సూర్య, బషీర్, ఠాగూర్, రాంబాబు, గౌస్, అప్పారవు కుర్రం, ఎన్ రాంబాబు తదితరులు పాల్గొన్నారు.