జనసేన పార్టీ 12వ వార్డు అధ్యక్షుడు కిషోర్ ఇంటి పై వైసిపి రౌడీ మూకల దాడి!!

తిరుపతి: స్థానిక వైసీపీ నాయకుడు కొడుకు దాదాపు 20 మంది గంజాయి మత్తులో ఉన్న యువకులతో కలిసి కిషోర్ ఇంట్లోకి దూరి ఇంట్లో ఆడవాళ్ళను దూషిస్తూ, మీరు మీ పార్టీ ప్రచారం ఎలా చేస్తారో చూస్తాం అని మీ అంతు చూస్తాం అని బెదిరిస్తూ ఇంటి బయట గేట్ ను పగలగొట్టి హల్చల్ చేశారు. ఈ విషయం తెలుసుకున్న జనసేన పార్టీ ఇంచార్జి కిరణ్ రాయల్, ఎంఎల్ఏ అభ్యర్థి ఆరని శ్రీనివాసులు, జిల్లా అధ్యక్షులు పసుపులేటి హరిప్రసాద్, పట్టణ అధ్యక్షుడు రాజారెడ్డి ఇతర నాయకులు వచ్చేలోపు ఆ యువకులు పరారయ్యారు. దీనిపై ఈస్ట్ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చి దాడి చేసిన వారిని అదుపులోకి తీసుకుని వారి మీద చర్యలు తీసుకోవాలని తెలిపారు.