అంగన్వాడి కేంద్రం ఏర్పాటుకు జనసేన పార్టీ విజ్ఞాపన

శేరిలింగంపల్లి నియోజకవర్గం: జనసేన పార్టీ శేరిలింగంపల్లి జనసేన కో ఆర్డినేటర్ మాధవ రెడ్డి ఆదేశాల మేరకు చందానగర్ డివిజన్ అధ్యక్షులు బి. అరుణ్ కుమార్ మరియు ఇతర జనసైనికులతో కలిసి జి.హెచ్.ఎం.సీ డిసి లేనందువలన, అసిస్టెంట్ మున్సిపల్ కమిషనర్ సురేష్ ను కలిసి సమస్యను వివరించడం జరిగింది. అనంతరం వారికి వినతి పత్రం అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా జనసేన నాయకులు మాట్లాడుతూ, ప్రభుత్వం వారు చేపట్టిన ఐ.సి.డి.ఎస్ కార్యక్రమాలు మదీనాగూడ నందు గర్భిణీ స్త్రీలకు మరియు పసి పిల్లలకు పోషక విలువలు ఉన్న ఆహారం అందక పోవడంవల్ల పిల్లల్లో విటమిన్ లోపాలతో అనేక రకాల సమస్యల బారిన పడటం మరియు గర్భిణీ స్త్రీలకు ఆరోగ్య సమస్యలకు గురి కావడం మన భావితరాలపై ఎంతో ప్రభావం చూపుతుంది పైగా మదీనా గూడ నందు ఐ.సి.డి.ఎస్ కేంద్రం లేకపోవటం వలన గర్భిణీ స్త్రీలు 4-5 కి.మీ నడిచి ఇతర కేంద్రాలకు చేరుకోవలసిన పరిస్థితి మదినగూడ విలేజ్ లో ఉన్నది. కావున ప్రభుత్వం వారు తక్షణమే స్పందించి మదీనగూడ నందు ఐ.సి.డి.ఎస్ కేంద్రం ఏర్పాటు చేయాలని జనసేన పార్టీ తరపున డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జనసైనికులు శ్రవణ్ కుమార్ జి ఎస్ కే, ఉపేంద్ర, సందీప్, నరేష్, కామరాజు, నాగరాజు మరియు ఇతర కార్యకర్తలు పాల్గొన్నారు.