జాన్పహాడ్ దర్గా ఉర్సు ఉత్సవాలలో జనసేన పార్టీ

నల్గొండ జిల్లా, పాలకవీడు మండలంలోని జాన్పహాడ్ దర్గా ఉర్సు ఉత్సవాలలో జనసేన పార్టీ తరుపున ముఖ్య అతిథిగా పాల్గొన్న జనసేన పార్టీ ఉమ్మడి నల్గొండ జిల్లా అధ్యక్షులు సరికొప్పుల నాగేశ్వరరావు. దర్గా ముజావర్ నాగేశ్వరరావుతో ప్రత్యేక ప్రార్థనలు చేపించడం జరిగింది. మత సామరస్యానికి ప్రతీకగా నిలిచే ఈ దర్గా నుండి అందరూ స్ఫూర్తి పొందాలని ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఆరోగ్య వంతంగా ఉండాలని, మరియు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అధికారంలోకి రావాలని అధ్యక్షులు నాగేశ్వరరావు ప్రార్థనలు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో నేరేడుచర్ల మరియు పాలకవీడు మండల జనసేన నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.