జనసేన పార్టీ బత్తలపల్లి మండల కమిటీ సభ్యుల నియామకం

ధర్మవరం నియోజకవర్గం: ధర్మవరం పట్టణంలోని నూతన జనసేన పార్టీ కార్యాలయంలో మంగళవారం జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన్ రెడ్డి ముదిగుబ్బ మండలం, తాడిమర్రి మండలం, బత్తలపల్లి మండలాల బూత్ కమిటీ సభ్యులతో ముఖ్య సమావేశం నిర్వహించి ఓటర్ లిస్ట్ లను బూత్ కమిటీ సభ్యులకు అందజేసి వారి గ్రామాలలో ఓటర్ జాబితాను క్షుణ్ణంగా పరిశీలించి ఎక్కడెక్కడ అయితే దొంగ ఓట్లు, డబుల్ ఓట్లు ఉన్నాయో వాటిని గుర్తించి తొలగించే దిశగా ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకెళ్దామని తెలియజేయడం జరిగింది. అలాగే బత్తలపల్లి మండల కమిటీ సభ్యులను నియమించడం జరిగింది. ఈ కమిటీలో నియమితులైన వారు మండల కమిటీ అధ్యక్షులుగా పుర్రం శెట్టి రవి, ఉపాధ్యక్షులుగా దాడితోట కృష్ణయ్య, ఎం ఓబిరెడ్డి ప్రధాన కార్యదర్శులుగా ధారా గంగాధర, గంగయ్య, సాకే పెద్దన్న, ఇండ్ల రామాంజనేయులు కార్యదర్శులుగా శ్రీనివాసులు ఇండ్ల గోవర్ధన్, చెన్నారెడ్డి డి మధు, పి మధు, దేవరకొండ నరసింహ సంయుక్త కార్యదర్శులుగా ఎస్ కుళ్లాయప్ప, గొంగటి హరి, రాధాకృష్ణ, జి నరేంద్ర, వంశీ, జి చెన్నయ్య, సాయి మోహన్, గొగుల రాజు, ఆర్వేటి రామ నంద గార్లకు చిలకం మధుసూదన్ రెడ్డి నియామక పత్రాలను అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముదిగుబ్బ మండల కన్వీనర్ గుర్రం జయచంద్ర, మత్స్యకార వికాస విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బెస్త శ్రీనివాసులు, మాజీ కౌన్సిలర్ వెంకటరెడ్డి, మండల ఉపాధ్యక్షులు గొట్లురు జీవి, పట్టణ నాయకులు అడ్డగిరి శ్యామ్ కుమార్, జిల్లా సంయుక్త కార్యదర్శి దూది జయ రామాంజనేయులు, కార్యనిర్వాహణ కమిటీ సభ్యులు కోటికి రామాంజి, శివ శంకర్ రెడ్డి, టి.ప్రతాప్ మరియు తదితరులు పాల్గొన్నారు.