జనసేన పార్టీ రైతు భరోసా యాత్ర.. టీం-పిడికిలి పోస్టర్లతో ప్రచారం

పార్వతీపురం మన్యం జిల్లా, పాలకొండ నియోజకవర్గo, వీరఘట్టం మండల కేంద్రంలో.. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అప్పుల బాధలతో, నష్టాలతో నిండా మునిగి ఎటు వెళ్ళాలో తెలియక ఆత్మహత్యే మార్గం అని చనిపోయిన కౌలు రైతుల కుటుంబాలకు అండగా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ నేను ఉన్నాను.. అని భరోసా ఇచ్చి లక్ష రూపాయలు ఆర్థిక సాయం చేసి గొప్ప మనసును చాటుకున్నారు. దీనికి అండగా టీం పిడికిలి రాజా మైలవరపు సహాయ సహాకారoతో ఈ రైతు భరోసా యాత్ర ప్రజలకు చేరువయ్యేలా పాలకొండ నియోజకవర్గoలోని నాలుగు మండలాలకు పోస్టర్స్, స్టిక్కర్లను పంపిణీ చేయడం జరిగిందిని టీమ్ పిడికిలి కోఆర్డినేటర్ మత్స పుండరీకం తెలియజేసారు.
2024 లో పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అవ్వాలనే దిశగా టీం పిడికిలి రాజా మైలవరపు ఎంతో కృషి చేస్తున్నారు. జనసైనికులు సమన్వయంతో పనిచేసి రాబోయే ఎన్నికల్లో జనసేన పార్టీని అధికారంలోకి వచ్చే విధంగా కృషిచేయాలి అన్నారు. అనంతరం గోడలకు వాల్ పోస్టర్లు, ఆటోలకు స్టిక్కర్లు అతికించారు. ఈ కార్యక్రమంలో వీరఘట్టం మండలం టీమ్ పిడికిలి కోఆర్డినేటర్ కర్ణేన సాయి పవన్, బబ్బది పకీరు నాయుడు, పొట్నూరు దుర్గాప్రసాద్, కడగల హరికృష్ణ, దనుకొండ సందీప్, రౌతు గోవింద రావు, కోడి వెంకటరావు నాయుడు, కంటు మురళి, అన్ను రామకృష్ణ, తదితర జనసేన నాయకులు పాల్గొన్నారు.