జి.మాడుగుల మండలంలో ఘనంగా జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
పాడేరు నియోజకవర్గం, జి.మాడుగుల మండలం, గెమ్మెలి పంచాయితీ, కులపాడు గ్రామంలో జి మాడుగుల మండల జనసేన పార్టీ అధ్యక్షుడు మసాడి భీమన్న(ప్రశాంత్) అధ్యక్షతన అరకు పార్లమెంట్ ఇంచార్జ్ గౌరవ డాక్టర్ వంపూరు గంగులయ్య ఆదేశాల మేరకు జనసేన పార్టీ 9వ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమం కనుల పండుగగా జరిగింది. పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్బంగా ముందుగా జి.మాడుగుల జనసేన పార్టీ అధ్యక్షుడు పార్టీ జెండాను ఆవిష్కరించి జనసేన పార్టీ విధానాలు, పార్టీ సిద్ధాంతాలు ప్రజలకు కార్యకర్తలకు దిశ నిర్దేశం చేయడం జరిగింది.
పార్టీ బలోపేతం అవ్వటం కోసం ప్రతి కార్యకర్త సైనికుడిలా పనిసేసి పార్టీ విజయమే లక్ష్యం గా పనిచేయాలి అని పేర్కొన్నారు. వైసీపీ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టడం జరిగినది. ఈ కార్యక్రమంలొ పాడేరు జనసేన పార్టీ అధ్యక్షుడు నందోలి మురళీకృష్ణ, ఉపాధ్యక్షుడు సాలెబు అశోక్, జి.మాడుగుల మండల ప్రధాన కార్యదర్శి గొంది మురళి, ఉపాధ్యక్షుడు సాగెని ఈశ్వర్రావు, యూత్ అధ్యక్షులు చేక్ మస్తాన్, ఉపాధ్యక్షుడు పవన్ కళ్యాణ్, కార్యనిర్వాహక అధ్యక్షుడు మసాడి సింహాచలం, ఉపకార్యదర్శి కొదమా కొండబాబు, గౌరవ అధ్యక్షులు తెరవాడ వెంకటరమణ, అధిక సంఖ్యలో ప్రజలు, పార్టీ కార్యకర్తలు పాల్గొనడం జరిగింది.