వర రామచంద్రపురం మండలంలో జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా వర రామచంద్రపురం మండలంలో పార్టీ నాయకులు కార్యకర్తలు ఘనంగా వేడుకలు జరిపారు. జనసేన పార్టీ మండల అధ్యక్షులు ములకాల సాయి కృష్ణ అధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో మొదటిగా జీడిగుప్ప గ్రామంలో జండా ఆవిష్కరణ మరియు కేక్ కట్ చేసిన అనంతరం జనసైనికులు అందరూ పెద్ద ఎత్తున ర్యాలీగా రేఖపల్లి చేరుకొని ప్రభుత్వ ఆసుపత్రిలో పండ్లు మరియు బ్రెడ్స్ పంపిణీ చేయడం జరిగింది, అనంతరం వి.ఆర్.పురం కు చెందిన వికలాంగురాలు వసంత కు ఫ్రూట్స్ మరియు ఆర్ధిక సహాయం చేయడం జరిగింది. ఆ తర్వాత రేఖపల్లి సెంటర్లో కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ములకాల సాయికృష్ణ మాట్లాడుతూ.. మండల స్థాయి లో విస్తృతంగా తిరిగి పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, మా నాయకుడు పవన్ పవన్ కళ్యాణ్ ను ముఖ్యమంత్రిని చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు కనుగుల శ్రీనివాస రెడ్డి, కోట్ల మోహన్ రెడ్డి, ముత్యాల నాగు, ముంజపు సాయి, బండారు రమేష్, చంద్రమౌళి ఆదిత్య, పోషీ రెడ్డి, మణికంఠ, పవన్ కల్యాణ్, సాగర్, నాగరాజు వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

This image has an empty alt attribute; its file name is WhatsApp-Image-2022-03-15-at-7.21.36-PM-1024x682.jpeg