జనసేన పార్టీ ఉచిత వైద్య శిబిరం

శేరిలింగంపల్లి, జనసేన పార్టీ 11వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలలో భాగంగా శేరిలింగంపల్లి నియోజకవర్గ ఇంఛార్జి డాక్టర్.మాధవరెడ్డి ఆదేశాల మేరకు ఆల్విన్ కాలని 124 డివిజన్ అద్యక్షులు అబోతుల మాధవరావు నాయకత్వంలో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేయటం జరిగింది. ఈ కార్యక్రమంలో కాలని వాసులు విశేషంగా పాల్గొని ఉచిత వైద్య శిభిర సేవలు వినియోగించుకోవడం జరిగింది. ఈ సందర్భంగా కాలని వాసులు పెరుగుతున్న ఖర్చులు తరుణంలో ఇబ్బంది పడుతున్న వారికి ఈ ఉచిత వైద్య శిబిరం ఎంతగానో ఉపోయోగకరం ఉందని తెలియచేశారు, సమాజం పట్ల బాధ్యత, సేవ చేసే లక్షణం కలిగి ఉండటం అరుదుగా ఉన్న నేటి సమాజంలో జనసేన పార్టీ చేపట్టిన ఈ కార్యక్రమం పట్ల కాలనీ వాసులు సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో శ్రావ్యనిక వైద్య బృందం మరియు జనసేన పార్టీ రాష్ట్ర నాయకులు, నియోజకవర్గ డివిజన్ కో-ఆర్డినేటర్లు, వీర మహిళలు, జనసైనికులు పాల్గొని విజయవంతం చేయటం జరిగింది.