సత్తుపల్లి ఎన్నికల బరిలో జనసేన పార్టీ

తెలంగాణ, సత్తుపల్లి, జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు తెలంగాణ రాష్ట్ర కమిటీ తెలంగాణలో 32 నియోజకవర్గాల్లో జనసేన పార్టీ పోటీ చేస్తుంది అని ప్రకటించడం జరిగింది. ఈ సందర్భంగా సత్తుపల్లి నియోజకవర్గ ఇన్చార్జి బండి నరేష్ మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో సత్తుపల్లి నియోజకవర్గం నుండి జనసేన పార్టీ కచ్చితంగా పోటీ చేస్తుందని తెలియజేయడం జరిగింది. సత్తుపల్లిలో జనసేన పార్టీకి ఉన్నటువంటి బలం అదేవిధంగా సామాజిక మరియు భౌగోళిక పరిస్థితులు దృష్ట్యా గత సంవత్సరం నుండి నిర్విరామంగా నడుస్తున్నటువంటి పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నమని ఉద్యమాల పురిటి గడ్డ ఉస్మానియా యూనివర్సిటీ జేఏసీ ప్రెసిడెంట్ బండి నరేష్ చెప్పుకొచ్చారు. ఎన్నికల పోటీ చేసే అభ్యర్థి విషయంలో మాట్లాడుతూ ఎవరైతే ముందు నుండి పార్టీ కోసం కష్టపడి ఇన్చార్జిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారో వారిని అధ్యక్షులు పవన్ కళ్యాణ్ అభ్యర్థిగా ప్రకటించే అవకాశం ఉందని తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో శివాజీ, శరత్, జబీర్, మహేష్, అనూష, సైఫ్ ఖాన్, రవి వర్మ తదితరులు పాల్గొన్నారు.