రాబోయే రోజుల్లో జనసేన పార్టీ ప్రశ్నించే స్థాయి నుంచి పాలించే స్థాయికి జనసేన పార్టీ

చింతలపూడి, రాబోయే రోజుల్లో జనసేన పార్టీ ప్రశ్నించే స్థాయి నుంచి పాలించే స్థాయికి జనసేన పార్టీ ముందుకి వెళ్తుందని దానికి నిదర్శనమే ఇతర పార్టీల నాయకులు జనసేనలో చేరడమేనని జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు కొటికలపూడి గోవిందరావు అన్నారు. చింతలపూడి నియోజవర్గం, చింతలపూడి మండల జనసేన పార్టీ సిద్ధాంతాలకు ఆకర్షితులై చీదరాల మధుబాబు, చీదరాల మల్లికార్జున రావు, శేషపల్లి గంగాధరరావు, ఉండి నియోజకవర్గం కాళ్ల మండలం నుంచి చవ్వాకుల వీరభద్రరావు , ఓగిరాల రాజేష్, మోటూరు కృష్ణ లు, పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షులు కొటికలపూడి గోవిందరావు, పిఏసి సభ్యులు కనకరాజు సూరి సమక్షంలో భీమవరం పార్టీ కార్యలయంలో జనసేన తీర్థం తీసుకోవటం జరిగింది. సుమారు 50 మంది జనసేన పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో పోలవరం నియోజకవర్గ ఇన్చార్జి చిర్రి బాలరాజు, చింతలపూడి నియోజకవర్గ ఇంచార్జ్ మేక ఈశ్వరయ్య, జిల్లా కమిటీ నుంచి జిల్లా ప్రధాన కార్యదర్శులు కరాటం సాయి, చెనమల్ల చంద్రశేఖర్, సెక్రెటరీ గడ్డమణుగు రవికుమార్, జిల్లాకమిటీ సభ్యులు, మండల ప్రెసిడెంట్లు, ఎంపీటీసీలు, వార్డు మెంబర్లు, గ్రామ ప్రెసిడెంట్లు చింతలపూడి, పోలవరం, ఉండి నియోజకవర్గల నాయకులు, జనసైనికులు, వీరమహిళలు కార్యకర్తలు పాల్గొన్నారు.