జనసేన పార్టీ ఐటీ విభాగం సమావేశం

రాజోలు నియోజకవర్గం: జనసేన పార్టీ ఐటీ విభాగం సమావేశం ఆదివారం రాజోలు నియోజకవర్గ జనసేన తెలుగుదేశం పార్టీల సమన్వయకర్త గుండుబోగుల పెదకాపు నివాసం వద్ద జరిగింది. ఈ సమావేశంలో ఐటీ విభాగ పనితీరు మరియు రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ఐటీ టీం చేయబోయే కార్యక్రమాలపై చర్చించడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాజోలు జనసేన పార్టీ ఐటీ కో ఆర్డినేటర్ వై లక్ష్మణ్, వి సాగర్, సందీప్, శ్రీనివాస్, దుర్గాబాబు, బస్వంత్, పృథ్వి, ఆదిత్య, దినేష్, మణికంఠ, పవన్, ఉదయ్, కిషోర్, తేజ తదితర ఐటీ విభాగ సభ్యులు పాల్గొన్నారు.