జనసేన పార్టీ నాయకుల సమావేశం
ప్రకాశం జిల్లా, కొమరోలులో గిద్దలూరు జనసేన పార్టీ ఇంచార్జ్ బెల్లంకొండ సాయిబాబు జనసేన పార్టీ నాయకులతో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో అతి త్వరలో జనసేన పార్టీ నియోజకవర్గంలోని ఆరు మండలాల కమిటీలను ఏర్పాటు చేయడంతో పాటు పార్టీ కార్యక్రమాల రూపకల్పన గురించి చర్చించారు. ప్రతి ఒక్క జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు స్వయంగా ప్రజల వద్దకు వెళ్లి వారి సమస్యలను తెలుసుకోవాలని జనసేన పార్టీ నాయకులతో ఇంచార్జ్ సాయిబాబు అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రకాశం జిల్లా సంయుక్త కార్యదర్శి గజ్జలకొండ నారాయణ, కొమరోలు మండల అధ్యక్షుడు సారే ఓబులేసు నాయుడు, గిద్దలూరు మండల అధ్యక్షుడు పగడాల సాయి ఈశ్వర్ మరియు జనసేన పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/02/WhatsApp-Image-2022-02-13-at-4.24.27-PM-1024x577.jpeg)