- ఆవిర్భావ దినోత్సవ వేడుకలు విజయవంతం చేద్దాం
- రాజంపేట పార్లమెంటు జనసేన పార్టీ ఇంచార్జ్ యల్లటూరు శ్రీనివాస రాజు
ఉమ్మడి కడప జిల్లా రాజంపేట నియోజకవర్గం జనసేన పార్టీ కార్యాలయము (యల్లటూరు భవన్) నందు జనసేన నాయకులు యల్లటూరు శ్రీనివాస రాజు అధ్యక్షతన ముఖ్య నాయకులు సమావేశం నిర్వహించడం జరిగింది. మార్చి 14న పిఠాపురం చిత్రాడలో జరగనున్న జనసేన 12 వ ఆవిర్భావ సభ చరిత్రలో నిలిచిపోతుందని, జనసేనపార్టీ ఆవిర్భావం నుండి అభివృద్ధి వరకు తోడు ఉన్న ప్రతి ఒక్కరు ఈ వేడుకల్లో పాల్గొని ఆవిర్భావ దినోత్సవ వేడుకలు విజయవంతం చెయ్యాలని పార్టీ నాయకులు, జనసైనికులు మరియు వీరమహిళలు అందరూ హాజరై కలిసికట్టుగా పండగ జరుపుకుందామని రాజంపేట జనసేనపార్టీ నాయకులు అన్నారు. అనంతరం ఛలో పిఠాపురం పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో రాజంపేట జనసేనపార్టీ సీనియర్ నాయకులు, జనసైనికులు పాల్గొన్నారు.
Share this content:
Post Comment