జనసేన పార్టీ మెగా ఉచిత వైద్య శిబిరం

శేరిలిగంపల్లి నియోజకవర్గం: శేరిలిగంపల్లి జనసేన పార్టీ ఆధ్వర్యంలో మెగా ఉచిత వైద్య శిబిరం నిర్వహించడం జరిగింది. ఈ వైద్య శిబిరంలో సుమారు ఒక 300 మంది పైగా చిన్నపిల్లలకి, వృద్ధులకు ఉచిత వైద్యం ఇవ్వడం జరిగింది. వారికి వైద్యుల పర్యవేక్షణలో మెడిసిన్ పంపిణీ జరిగింది. అలాగే ఉచిత రక్త పరీక్షలు నిర్వహించారు. అనంతరం మీడియాతో డాక్టర్ మాధవ రెడ్డి మాట్లాడుతూ.. పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు సిద్ధాంతాలు ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లడానికి మరియు పార్టీ బలోపేతానికి ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ మురళీకృష్ణ, డాక్టర్ కామేశ్వరి, దాక్షాయిని, సత్య భారతి, శ్రవణ్, సందీప్, సూర్య, అరుణ్, అశోక్, చిరంజీవి, వీర వెంకట్,రామ్ సాయి, ప్రవీణ్, ప్రసాద్, గణేష్, జాషువా, రాజేష్, ప్రదీప్, రవి, మున్నా, రవి తేజ, కిరణ్ తదితర జనసేన కార్యకర్తలు పాల్గొన్నారు.