జనసేన పార్టీ గెలుపే ద్యేయంగా కృషి చేయాలి: కొట్టే వెంకటేశ్వర్లు

కాపు సంఘ నాయకులు పెద్దన్న పాత్ర పోషిస్తూ బీసీ, ఎస్సీ లతో పాటు అన్ని వర్గాలను కలిపి రాబోయే ఎన్నికల్లో జనసేన పార్టీ గెలుపే ద్యేయంగా కృషి చేయాలని జనసేన పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కమిటీ కార్యదర్శి కొట్టే వెంకటేశ్వర్లు కోరారు. నూతనంగా ఎన్నికైన కాపు సంక్షేమ సేన జిల్లా అధ్యక్షులు పూసల మల్లేశ్వరరావును బుధవారం శాలువతో అభినందించి కాపుల సమస్యల పరిష్కారానికి కృషి చేయడంతో పాటు జనసేన పార్టీ బలోపేతానికి కృషి చేయాలని కోరారు.