డొక్కా సీతమ్మ ఆశయ సాధనకై అన్నదాన కార్యక్రమం నిర్వహించిన జనసేన పార్టీ…!!

*ఆకలి తీర్చే ఆంధ్రుల అన్నపూర్ణ డొక్క సీతమ్మ ఆశయ సాధనకై అన్నదాన కార్యక్రమం నిర్వహించిన జనసేన పార్టీ…!!

కాకినాడ జిల్లా పిఠాపురం టౌన్: ఆశ వక్తిత్వం ఆశయం మానవత్వం ఆశయసాధలో నాతోటి మనిషులు ఆకలితో ఉండకూడదని బలమైన సంకల్పంతో లంక గన్నవరంకి చెందిన ఆంధ్రుల అన్నపూర్ణ డొక్క సీతమ్మ తనకు ఉన్నంతలోనే ఉభయగోదావరి జిల్లాల్లో అందరి ఆకలి తీర్చే అమ్మగా పేరునొందిన డొక్క సీతమ్మ గారి ఆశయాలకు అణుగుణంగా జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి ఆశయాల మేరకు బుధవారం పుణ్య మంతుల సూర్య నారాయణ మూర్తి స్థానిక ప్రభుత్వ ఆస్పత్రిలో గర్భిణీ స్త్రీలకు ఇతర పేషంట్లు కు భోజనం పంపిణీ కార్యక్రమాన్ని చేబట్టగా పిఠాపురం నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ చార్జ్ శ్రీమతి మాకినీడి శేషుకుమారి ముఖ్య అతిథిగా పాల్గొని ఆస్పత్రిలో గర్బిణిలకు పేషంట్లకు భోజనం అందజేసారు. ఈ సందర్భంగా కార్యక్రమాన్ని ఉద్దేశించి మాకినీడి శేషుకుమారి మాట్లాడుతూ.. ఆంధ్రుల అన్నపూర్ణ డొక్క సీతమ్మ గారు ఆకలితో అలమటించేవారిని కడుపునింపి ఆకలితీర్చే అమ్మగా ఆదర్శ మూర్తిగా గుర్తింపు నొందిన పుణ్య మూర్తి శ్రీ డొక్క సీతమ్మ గారి ఆశయాలను ఆదర్శంగా తీసుకొని మా అధినేత పవన్ కళ్యాణ్ గారు ఇలాంటి మాతృమూర్తులను ఇన్స్పరేషన్ గా తీసుకుని ఆ భావజాలంతో ముందుకి సాగాలని.. ఆలోచన విధానాన్ని అనుసరిస్తూ.. సమాజసేవ చేయాలనే సంకల్పంతో బుధవారం మన పిఠాపురం ప్రభుత్వ ఆస్పత్రిలో పేషంట్లకు అన్నదానం చేపట్టడం జరిగిందని అన్నారు. ఈ సందర్భంగా.. ఆసుపత్రిలో ఆన్ని సౌకర్యాలు అందుతున్నాయా అని అడిగి తెలుసుకున్నారు..! ఈ కార్యక్రమంలో పుణ్యవంతులు సూర్యనారాయణ మూర్తి, గొల్లప్రోలు మండల ప్రెసిడెంట్ అమరాది వల్లి రామకృష్ణ, యండ్రపు శ్రీనివాస్, నమ శ్రీకాంత్, కనకం అశోక్, కసిరెడ్డి నాగేశ్వరరావు, జనసైనికులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.