జనసేన పార్టీని విస్తృతంగా తీసుకెళ్లాలి: నేమూరి శంకర్ గౌడ్

తెలంగాణలో ఎన్నికల షెడ్యూలు ఖరారు కావడంతో గ్రేటర్ జనసేన శ్రేణులతో జూబ్లీహిల్స్ జనసేన పార్టీ రాష్ట్ర కార్యాలయంలో
రాష్ట్ర ఇంచార్జ్ నేమూరి శంకర్ గౌడ్, గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షులు రాధారం రాజలింగం, సమావేశం నిర్వహించి నియోజకవర్గాలలో ఇన్చార్జిలు పోలింగ్ బూత్ కమిటీలు త్వరగా పూర్తి చేసి నియోజకవర్గ ప్రజల్లోకి జనసేన పార్టీని విస్తృతంగా తీసుకెళ్లాలని కోరారు. ఈ యొక్క సమావేశంలో గ్రేటర్ జనరల్ సెక్రెటరీ దామోదర్ రెడ్డి, పర్యవేక్షణ సభ్యులు సురేష్ రెడ్డి, లిఖిత, గ్రేటర్ లోని నియోజకవర్గ ఇన్చార్జిలు, నాయకులు, జనసైనికులు, వీర మహిళలు పాల్గొన్నారు.