బలమైన రాజకీయ శక్తిగా జనసేన పార్టీ ఎదగాలి: ముకుంద నాయుడు

  • జనసేన పార్టీ వనపర్తి కో-ఆర్డినేటర్ ముకుంద నాయుడు

గోపాల్ పెట్: వనపర్తి జిల్లాలోని గోపాల్ పేట మండల కేంద్రములో జనసేన పార్టీ వనపర్తి కో-ఆర్డినేటర్ ముకుంద నాయుడు అధ్యక్షతన జరుపుతున్న నియోజకవర్గస్థాయి సమావేశాల్లో భాగంగా తెలంగాణ రాష్ట్ర నాయకులు వంగా లక్ష్మణ్ గౌడ్ ముఖ్య అతిథిగా జనసేన ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈసారి ఆంధ్రప్రదేశ్లోనే కాకుండా తెలంగాణాలో కూడా జనసేన పార్టీ బలమైన రాజకీయ శక్తిగా మారుతుందని తెలంగాణ రాష్ట్ర నాయకులు వంగ లక్ష్మణ్ గౌడ్ పేర్కొన్నారు. దానికి అనుగుణంగా అందరూ పనిచేయాలని పిలుపునిచ్చారు. వనపర్తి కోఆర్డినేటర్ ముకుంద నాయుడు మాట్లాడుతూ వచ్చే ఎన్నికలలో గెలుపు ఓటములను నిర్ణయించే స్థాయికి జనసేన పార్టీ కచ్చితంగా ప్రజల్లో నిలుస్తుందని, ఆ విధంగా తమ యువ నాయకులను పటిష్ఠమైన ప్రణాళికతో సిద్ధం చేసుకుంటున్నామని తెలిపారు. గోపాల్ పేట్ మండల అధ్యక్షులు మూర్తి నాయక్ మాట్లాడుతూ.. మండలంలోని అన్ని గ్రామాల్లో విస్తృతంగా పర్యటించి, జనసైనికులతో ప్రజా సమస్యల మీద పోరాడుతూ వారికి నిత్యం అందుబాటులో ఉంటూ చేయూతగా నడుస్తూ పార్టీని గ్రామ స్థాయిలో బలోపేతం చేస్తామని యువత నూతన రాజకీయ వ్యవస్థ దిశగా సహకరించాలనీ కోరారు. ఈ కార్యక్రమంలో వనపర్తి కో ఆర్డినేటర్ ముకుంద నాయుడు, గోపాల్ పేట్ మండల అధ్యక్షుడు మూర్తి నాయక్, ఇతర మండలాల అధ్యక్షులు ఉత్తేజ్, సురేష్, విజయ్ మరియు శరత్, రామ కృష్ణ, ప్రకాష్, శ్రీరామ్ తదితర నాయకులు పాల్గొన్నారు.